Share News

Yanamala Ramakrishnudu: సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకేం చెప్తారు?

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:22 PM

సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హానీ జరిగినా.. దానికి జగన్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

Yanamala Ramakrishnudu: సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకేం చెప్తారు?

అమరావతి: సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ (CM Jagan) ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. విజయమ్మ (Vijayamma), షర్మిల (Sharmila), సునీత (Sunitha)కు ఏ హానీ జరిగినా.. దానికి జగన్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?

జగన్ రెడ్డి పాపం పండిందని.. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయన్నారు. జగన్ రెడ్డి 420 అని నిన్న వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయని యనమల అన్నారు. పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారని నిలదీశారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు కల్పించారని యనమల అన్నారు.

Pawankalyan: ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 01:22 PM