CM Jagan: మాయమైన జగన్ గాయం.. కనీసం ఆనవాళ్లూ లేవుగా
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:58 PM
2019 ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడిన సీఎం జగన్(CM Jagan).. ఈ సారి గులకరాయి డ్రామా ఆడారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఈ డ్రామా ఆడారని ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుండగా.. దాన్ని వైసీపీ ఖండిస్తూ వస్తోంది.
అమరావతి: 2019 ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడిన సీఎం జగన్(CM Jagan).. ఈ సారి గులకరాయి డ్రామా ఆడారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఈ డ్రామా ఆడారని ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుండగా.. దాన్ని వైసీపీ ఖండిస్తూ వస్తోంది. తాడేపల్లిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా శనివారం జగన్ నుదుటిపై జరిగిన గాయం మాయమైంది. గాయానికి కుట్లు వేశామని డాక్టర్లు చెప్పారు.
అయితే అసలు నుదుటిపై గాయం ఉన్నట్లు కానీ, కుట్ల తాలూకు ఆనవాళ్లు కానీ కనిపించకపోవడం గమనార్హం. దీంతో గాయం ఆనవాళ్లు ఏమయ్యాయని అందరూ చర్చించుకుంటున్నారు. గులకరాయి దెబ్బ డ్రామా అని ప్రతిపక్షాలు చెప్పిందే ఇప్పుడు నిజమైందని ప్రజలు అనుకుంటున్నారు. ఓట్ల కోసం మరీ ఇంతలా దిగజారుతారా అని దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే అసలు నుదుటిపై గాయం ఉన్నట్లు కానీ, కుట్ల తాలూకు ఆనవాళ్లు కానీ కనిపించకపోవడం గమనార్హం. దీంతో గాయం ఆనవాళ్లు ఏమయ్యాయని అందరూ చర్చించుకుంటున్నారు. గులకరాయి దెబ్బ డ్రామా అని ప్రతిపక్షాలు చెప్పిందే ఇప్పుడు నిజమైందని ప్రజలు అనుకుంటున్నారు. ఓట్ల కోసం మరీ ఇంతలా దిగజారుతారా అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఏప్రిల్ 13న విజయవాడ సభలో జగన్పై రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీష్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Andhra Pradesh and Telugu News Here