Anitha : వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేసిన జగన్
ABN , Publish Date - Mar 07 , 2024 | 10:18 PM
జగన్ ప్రభుత్వం (Jagan Govt) వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేశారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... క్యాస్టు సర్టిఫికెట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. జగన్ అసమర్థడని సొంత చెల్లి షర్మిల చెబుతుందని అన్నారు.
విశాఖపట్నం: జగన్ ప్రభుత్వం (Jagan Govt) వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేశారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... క్యాస్టు సర్టిఫికెట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. జగన్ అసమర్థడని సొంత చెల్లి షర్మిల చెబుతుందని అన్నారు.
జగన్కి ఓటు వేయవద్దని మరో చెల్లి సునీతారెడ్డి చెబుతుందన్నారు. దిశా చట్టం, దిశా యాప్ మహిళలకు రక్షణ కల్పించలేదని అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ల గురించి మాట్లాడకపోతే జగన్కు నిద్ర రాదని ఆరోపించారు.మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కమిషన్ చైర్మన్ రాజీనామ చేశారని చెప్పారు. రుషికొండలో నిర్మాణాలను రహస్యంగా ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఆర్కే బీచ్లో ప్లోటింగ్ బ్రిడ్జి లాగే - వైసీపీ బంగాళాఖాతంలో కొట్టుకుపోతుందని వంగలపూడి అనిత చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి