T.G.Bharath: కర్నూల్లో టీడీపీ నేతలపై పెరుగుతున్న దాడులు
ABN , Publish Date - Mar 25 , 2024 | 09:40 PM
వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని కర్నూలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్(T.G.Bharath) అన్నారు. సోమవారం నాడు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్లో భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ... ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు.
కర్నూలు: వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని కర్నూలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్(TG Bharath) అన్నారు. సోమవారం నాడు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్లో భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ... ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతామని హెచ్చరించారు. కర్నూలులో టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. కర్నూలు నగరంలో ఎక్కడికి వెళ్లినా టీజీవి గ్రూప్ సేవలు కనిపిస్తాయని తెలిపారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఏపీకి చంద్రబాబు కావాలని అన్నారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని టీజీ భరత్ పిలుపునిచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి