Share News

Chandrababu: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు..

ABN , Publish Date - Jan 14 , 2024 | 02:31 PM

సంక్రాంతి సంబరాల్లో పాల్లొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్ లో

Chandrababu: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు..

సంక్రాంతి సంబరాల్లో పాల్లొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్ లో స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేత నారా లోకేశ్ కూడా వచ్చారు. చంద్రబాబు, లోకేశ్ లకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి నారావారిపల్లెలోనే నారా, నందమూరి కుటుంబాలు బస చేయనున్నాయి. రేపు ( సోమవారం ) ఉదయం నాగదేవతలు, గ్రామ దేవత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం హెలికాప్టర్ లో అమరావతికి తిరుగపయనం కానున్నారు.

కాగా.. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు ఇక్కడికి చేరుకొని పండుగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను నందమూరి రామకృష్ణ, స్థానిక నేతలు భోగి మంటల్లో వేశారు.

Updated Date - Jan 14 , 2024 | 02:31 PM