Share News

Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు నామినేషన్..

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:37 AM

నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా సమర్పించడం లేదు. చంద్రబాబు తరుఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 01:27గంటలకు రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.

Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు నామినేషన్..

అమరావతి: నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నామినేషన్ వేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా సమర్పించడం లేదు. చంద్రబాబు తరుఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 01:27గంటలకు రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ముందుగా నామినేషన్ పత్రాలకు కుప్పంలోని వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Sharmila: కర్నూలు జిల్లాలో నేటి నుంచి షర్మిల న్యాయ యాత్ర


ఈ క్రమంలోనే భువనేశ్వరి కుప్పం పి.ఈ.ఎస్.మెడికల్ కళాశాలలోని గెస్ట్ హౌస్ నుంచి వరదరాజస్వామి దేవాలయానికి బయలుదేరి వెళ్లారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి కుప్పం టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ అనంతరం కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. భోజన విరామం అనంతరం కుప్పం పార్టీ కార్యాలయం వద్ద అంతర్గత సమావేశంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.

అనుమతులు లేకుండా ‘సిద్ధం’ ఫ్లెక్సీలు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 19 , 2024 | 10:37 AM