Share News

YS Viveka: వివేకా హత్య కుట్రదారులెవరో బయటపెట్టనున్న సునీతారెడ్డి..

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:21 AM

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. 11 గంటలకి ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో సునీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర దారులు ఎవరో మీడియాకు సునీతారెనడ్డి వెల్లడించనున్నారు. మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది.

YS Viveka: వివేకా హత్య కుట్రదారులెవరో బయటపెట్టనున్న సునీతారెడ్డి..

ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. 11 గంటలకి ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో సునీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర దారులు ఎవరో మీడియాకు సునీతారెడ్డి వెల్లడించనున్నారు.

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ (CM Jagan) బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది. నాలుగేళ్లుగా వివేకా హత్య కేసును సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తోంది. 2019 మార్చి 15న తన నివాసంలో దారుణంగా వివేకా హత్యకు గురయ్యారు. గతేడాది జూన్ 3న ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్‌పై ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 11:54 AM