Share News

MP Rammohan Naidu:జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే జగన్ ప్లాన్

ABN , Publish Date - Jan 27 , 2024 | 09:50 PM

జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే సీఎం జగన్‌(CM Jagan) ప్లాన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Rammohan Naidu) అన్నారు.

 MP Rammohan Naidu:జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే జగన్ ప్లాన్

శ్రీకాకుళం: జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే సీఎం జగన్‌(CM Jagan) ప్లాన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Rammohan Naidu) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం తధ్యమని చెప్పారు. దేశంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలంటే బాబు సీఎం కావాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుతింటుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.

జగన్ ఒడిపోవటానికి సిద్ధం అంటున్నాడని.. వైసీపీ కార్యకర్తలే ఆయనను అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్ అన్ని శాఖల్లోనూ పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలోఅవినీతి తప్పా.. ప్రజలకు ఒరిగేది ఏమి లేదని ఆరోపించారు. సీఎం జగన్‌(CM Jagan)ను తరిమికొడితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 27 , 2024 | 10:39 PM