Share News

TDP: టీడీపీ దెబ్బకు దిగివచ్చిన ఆర్టీసీ

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:14 AM

టీడీపీ దెబ్బకు ఆర్టీసీ దిగివచ్చింది. చిలకలూరిపేట సభకు ఎన్ని బస్‌లు కావాలో ఇండెంట్ ఇవ్వాలని టీడీపీని కోరింది. చిలకలూరిపేట సభకు తమకు బస్‌లు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

TDP: టీడీపీ దెబ్బకు దిగివచ్చిన ఆర్టీసీ

అమరావతి: టీడీపీ (TDP) దెబ్బకు ఆర్టీసీ (RTC) దిగివచ్చింది. చిలకలూరిపేట సభకు ఎన్ని బస్‌లు కావాలో ఇండెంట్ ఇవ్వాలని టీడీపీని కోరింది. చిలకలూరిపేట సభకు తమకు బస్‌లు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ (RTC MD)కి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) లేఖ రాశారు. బస్‌లు ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక పరిణామాలపై హెచ్చరించారు. మొన్న వైసీపీ (YCP) సిద్ధం సభకు 2 వేల 800 బస్‌లను ఆర్టీసీ కేటాయించింది. టీడీపీ ఆధ్వర్యంలో జరిగే చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ సైతం హాజరు అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

PM Modi: చిలకలూరిపేటలో ఉమ్మడి సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 10:33 AM