CM Jagan: ప్రకాశం జిల్లాలో ఇవాళ జగన్ పర్యటన
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:05 AM
ప్రకాశం జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ చెప్పారు.

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఇవాళ సీఎం జగన్ (CM Jagan) పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు (Veligonda Project) నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగొండ ప్రాజెక్టుకి జగన్ నిధులు కేటాయించారు.
గత టీడీపీ ( TDP( ప్రభుత్వంలో 80 శాతం వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం జరిగింది. నాలుగు సంవత్సరాల 10 నెలల్లో రెండున్నర కిలో మీటర్ల పాటు జగన్ సొరంగం పనులు చేశారు. రెండో సొరంగంలో లైనింగ్ పనులు కూడా పూర్తి చేయలేదు. 11 ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం అందలేదు. కాలువల నిర్మాణం కూడా జరగలేదు. పనులు పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామంటూ ఈ రోజు జగన్ పైలాన్ ఆవిష్కరిస్తున్నారు. జగన్ తీరుపై ప్రజలు, నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TDP: పెన్షన్ నుంచి ప్రత్యేక చట్టం వరకు.. బీసీ డిక్లరేషన్లోని 10 అంశాలివే!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...