Share News

TDP: ప్రజాగళం షెడ్యూల్ విడుదల.. 4 రోజులపాటు పర్యటనలో బిజీ కానున్న చంద్రబాబు

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:05 PM

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఎన్నో రోడ్ షోలు, సభలు నిర్వహించిన బాబు.. తాజాగా ప్రజాగళం పేరుతో సిద్ధమయ్యారు.

TDP: ప్రజాగళం షెడ్యూల్ విడుదల.. 4 రోజులపాటు పర్యటనలో బిజీ కానున్న చంద్రబాబు

అమరావతి: టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఎన్నో రోడ్ షోలు, సభలు నిర్వహించిన బాబు.. తాజాగా ప్రజాగళం పేరుతో సిద్ధమయ్యారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే ధ్యేయంగా ప్రజాగళాన్ని ముందుకు నడపనున్నారు. ఈ సందర్భంగా ప్రజాగళం షెడ్యూల్‌ని విడుదల చేశారు.

Mumbai: బీజేపీలోకి వెళ్తోంది ఆ ఐస్‌కి భయపడే.. కొత్త అర్థం చెప్పిన పవార్ కుమార్తె

మార్చి 27 నుంచి నాలుగు రోజులపాటు అంటే 31వ తేదీ వరకు ఈ యాత్ర సాగనుంది. రోజుకి 3- 4 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రోడ్ షోలు, సభలు ప్లాన్ చేసినట్లు టీడీపీ తెలిపింది. ఈ నెల 27న నెల్లూరు రూరల్, పలమనేరు, నగరి, నియోజకవర్గాల్లో, 28న కదిరి, రాప్తాడు, శింగనమల.. 29న నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలం, 30న మైదుకూరు, సూళ్లూరుపేట, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి ప్రచారంలో బాబు పాల్గొంటారు.

31న మార్కాపురం, సంతనూతలపాడు, కావలి, ఒంగోలులో పర్యటిస్తారు. సోమ, మంగళవారాల్లో ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా బాబు సమావేశాలు సాగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 04:27 PM