Share News

Mumbai: బీజేపీలోకి వెళ్తోంది ఆ ఐస్‌కి భయపడే.. కొత్త అర్థం చెప్పిన పవార్ కుమార్తె

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:43 PM

బీజేపీ ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాగుతుందని మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే ఆరోపించారు. ఆ పార్టీ ప్రలోభాలకు లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Mumbai: బీజేపీలోకి వెళ్తోంది ఆ ఐస్‌కి భయపడే.. కొత్త అర్థం చెప్పిన పవార్ కుమార్తె

బారామతి: బీజేపీ ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాగుతుందని మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే ఆరోపించారు. ఆ పార్టీ ప్రలోభాలకు లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం ఆమె మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలను ఇష్టపడి ఆ పార్టీలోకి ఎవరూ వెళ్లడం లేదని ఐస్‌(ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ, ఈడీ)కి భయపడే అందులోకి వెళ్తున్నారన్నారు. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి ఎంపీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసి ప్రతిపక్ష కూటమిలో చీలిక తేవాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 03:44 PM