Home » Supriya
ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.
మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను పోటీకి దింపింది.
బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు.
బీజేపీ ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాగుతుందని మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే ఆరోపించారు. ఆ పార్టీ ప్రలోభాలకు లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని..
విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల సమావేశం ముంబైలో విజయవంతం కావడంతో తదుపరి సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదక కానుంది. ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భగ్గుమన్నారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన నియామకం పట్ల పార్టీ నేత అజిత్ పవార్ సంతృప్తిగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను సుప్రియా సూలే తోసిపుచ్చారు. అవిన్నీ పుకార్లేనని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.