Share News

Baramati Lok Sabha Elections 2024: ముందంజలో సుప్రియా సులే

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:09 PM

మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కీలకమైన బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సునేత్ర పవార్‌పై ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సులే అధిక్యంలో కొనసాగుతున్నారు.

Baramati Lok Sabha Elections 2024: ముందంజలో సుప్రియా సులే

బారామతి, జూన్ 04: మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కీలకమైన బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సునేత్ర పవార్‌పై ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సులే అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ లోక్‌సభ స్థానం నుంచి ఆమె మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. మరోసారి ఆమె ఈ స్థానం నుంచి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రియా సులేపై ఆయన చిన్నాన్న, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ పోటీకి దిగారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 12:18 PM