Share News

Yanamala: చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:56 PM

ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కూటమి గెలుపు తర్వాత యనమల తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమన్నారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నదానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.

Yanamala: చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు

కాకినాడ: ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కూటమి గెలుపు తర్వాత యనమల తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమన్నారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నదానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజలు మంచి చేసిన ప్రభుత్వాలకే తోడుగా ఉంటారన్నారు. చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను దోచేసి ధనవంతులయ్యారని యనమల పేర్కొన్నారు. జగన్ దోపిడీ పాలనకు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారన్నారు. వైసీపీ ఓటమికి జగన్ ఆకృత్యాలు, అవినీతి, దోపిడీలే కారణమన్నారు. జగన్ పరిపాలనకు, ప్రతిపక్షానికి కూడా అనర్హుడని ప్రజలు తేల్చారని యనమల పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: షర్మిల

మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 01:56 PM