Share News

AP NEWS: బాబోయ్ ఆ ఎమ్మెల్యే ఎంతకు తెగబడ్డారో చూడండి.!?

ABN , Publish Date - Feb 29 , 2024 | 07:26 PM

జిల్లాలో ఓ వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే మరోసారి రెచ్చిపోయారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ పలు కుయుక్తులు పన్నుతోంది. కుట్రలో భాగంగా వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(Mla Pratapkumar Reddy) అరాచకాలు సృష్టిస్తున్నారు.

AP NEWS:  బాబోయ్ ఆ ఎమ్మెల్యే ఎంతకు తెగబడ్డారో చూడండి.!?

నెల్లూరు: జిల్లాలో ఓ వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే మరోసారి రెచ్చిపోయారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ పలు కుయుక్తులు పన్నుతోంది. కుట్రలో భాగంగా వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(Mla Pratapkumar Reddy) జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారు. భర్త ఉన్న మహిళలకు వితంతు పింఛన్లు ఇవ్వాలని సచివాలయ సిబ్బందిపై బెదిరింపులకు దిగుతున్నాడు. టీడీపీ ఓట్లు తీసేయాలంటూ తీవ్ర వత్తిళ్లు చేస్తున్నారు. అలాగే వైసీపీకు ఓట్లు వేసేలా జాబితాలో అడ్డగోలుగా పేర్లు చేరుస్తూ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారు. తాను చెప్పిందే చేయాలంటూ ఆర్డీవో శీనానాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్‌లకు హుకుం జారీ చేశారు.

ఓటర్ల జాబితాలో తాను చెప్పిన పేర్లను చేర్చలేదని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్‌ను తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేసి, సస్పెన్షన్‌కు అయ్యేలా కుట్ర పన్నారు. అయితే ఉన్నతాధికారుల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్‌‌కు గత 10 రోజులుగా పోస్టింగ్‌ను కమిషనర్ శ్రావణ్ కుమార్ ఇవ్వకుండా కుయుక్తులతో ఆపాడు. అయితే ఇందుకు సంబంధించిన ఎమ్మెల్యే రామిరెడ్డి, ఆర్డీవో, కమిషనర్ ఆడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 08:13 PM