Share News

Kotamreddy Sridhar Reddy: వైసీపీ నుంచి చాలా మంది పెద్ద నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధం

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:48 PM

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతలే కాదు.. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. నెల్లూరులో ఒకే సారి వైసీపీని వీడి వందలాది మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం వందలాది మంది టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Kotamreddy Sridhar Reddy: వైసీపీ నుంచి చాలా మంది పెద్ద నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధం

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతలే కాదు.. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. నెల్లూరులో ఒకే సారి వైసీపీని వీడి వందలాది మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం వందలాది మంది టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల‌ షెడ్యూల్ రాకముందే టీడీపీలోకి భారీ సంఖ్యలో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో చేరికలు ఊహించలేరన్నారు. వైసీపీ నుంచి చాలా మంది పెద్ద నేతలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.. వారంతా ముహుర్తాలు చూసుకుంటున్నారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 12:48 PM