Share News

AP News: నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

ABN , Publish Date - May 31 , 2024 | 04:45 PM

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో బంగారాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో చాకచక్యంగా నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు.

AP News: నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

నెల్లూరు: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో బంగారాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో చాకచక్యంగా నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... నెల్లూరి జిల్లాలోని కావలిలో భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. కలకత్తా - చెన్నై రహదారిపై వాహనాల తనిఖీలో ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న సుమారు రెండున్నర కోట్ల విలువైన మూడు కిలోల బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ బంగారాన్ని చెన్నై నుంచి విజయవాడకు నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వెనెుక సీట్లో ప్రత్యేకంగా అమర్చిన అరలో బంగారం రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆశిష్, గిరీష్ కుమార్, కమలేష్‌లు చెన్నై టీ నగర్‌లోని లక్ష్మీ జ్యూవెల్లర్స్‌లో పనిచేస్తున్నారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 04:56 PM