Share News

AP Politics: ఏం చేస్తారో చేసుకోండి.. సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్..

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:21 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM YS Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ(Narayana) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. ‘నీ రైడ్స్‌కి భయపడను. ఎన్ని సార్లు రైడ్స్ చేస్తారో చేసుకోండి.

AP Politics: ఏం చేస్తారో చేసుకోండి.. సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్..
Ex Minister Narayana

నెల్లూరు, మార్చి 06: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM YS Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ(Narayana) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. ‘నీ రైడ్స్‌కి భయపడను. ఎన్ని సార్లు రైడ్స్ చేస్తారో చేసుకోండి. పన్నులు కట్టకపోతే నోటీసులు ఇవ్వండి. లేకపోతే కోర్టుకు వెళ్లండి. ఏం చేస్తారో చేసుకోండి. దాడులు, సోదాలు చేయడం సరికాదు.’ అని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు నారాయణ. జగన్‌ది సైకో పాలన అని విమర్శించారు. ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, పెండింగ్‌లో ఉన్న వర్కులన్నీ పూర్తి చేస్తానని అన్నారు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని నారాయణ అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2024 | 10:21 PM