Share News

Andhra Pradesh: నేడు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ.. హైకోర్టు ఆదేశాలతో రక్షణ

ABN , Publish Date - Jan 13 , 2024 | 08:37 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు సొంత నియోజక వర్గం రానున్నారు.

Andhra Pradesh: నేడు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ.. హైకోర్టు ఆదేశాలతో రక్షణ

సంక్రాంతి పండుగ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు సొంత నియోజక వర్గం రానున్నారు. ఉదయం పది గంటలకు రాజమండ్రి చేరుకుని, రోడ్డు మార్గాన ఆచంట, పాలకొల్లు మీదుగా భీమవరం చేరుకోనున్నారు. వైసీపీ అధిష్టానం వైఖరిపై ఎంపీ రఘురామ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేసులు, అక్రమ అరెస్టుతో వైసీసీ సర్కారు ఆయనను వేధింపులకు గురి చేస్తోంది. కాగా.. హై కోర్టు చట్టపరమైన రక్షణ కల్పించడంతో సంక్రాంతి పండుగ నేపధ్యంలో ఆయన భీమవరం వస్తున్నారు.

సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు రక్షణ కల్పించాలంటూ రఘురామ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. పోలీసులు తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని పిటీషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు రఘురామకు చట్టపరమైన భద్రత కల్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jan 13 , 2024 | 08:38 AM