Share News

Balakrishna: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే... దారుణంగా చంపేశారు..

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:41 PM

దేశంలోనే ఏపీ అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి తెచ్చారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర సాధికర సభలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన మాట్లాడుతూ...

Balakrishna: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే... దారుణంగా చంపేశారు..

నెల్లూరు: దేశంలోనే ఏపీ అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి దిగజార్చారని టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ (MLA Balakrishna) ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో ‘స్వర్ణాంధ్ర సాధికార సభ’లో పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడన్నారు. ‘‘పైకేమో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. లోపల ఎస్సీలను దారుణంగా చంపి డోర్ డెలివరీలు చేశారు’’ అని ధ్వజమెత్తారు. రూ.1600 కోట్లతో రాష్ట్రమంతా సిద్ధం.. సిద్ధం.. అని హోర్డింగులు పెట్టుకున్నాడని, దేనికి సిద్ధం కావాలని బాలకృష్ణ ప్రశ్నించారు.


జాబ్ క్యాలెండర్ ఎత్తేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, పరిశ్రమలని తరిమేసి ఉన్న ఉద్యోగాలని కూడా పీకేశాడని మండిపడ్డారు. కరెంట్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేశారని, నిత్యవసర సరుకుల ధరలేమో ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ‘‘ పోలవరం పూర్తిచేయకపోగా, గోదావరిలో ముంచేశారంటూ దుయ్యబట్టారు. విజయసాయి వైజాగ్‌లో రుషికొండలు తవ్వుకుంటూ నాశనం చేశారని విమర్శించారు. ఇప్పుడేమో నెల్లూరు వచ్చారనన్నారు. ‘‘ కాకాణి కాకమ్మ కబుర్లు చెబుతుంటాడు. ఆయన కళ్లు పడితే భూములన్నీ కబ్జాలే. అభివృద్ది కావాలా? అరాచకాలు కావాలా?, స్వర్ణయుగం కావాలా?.. రాతియుగం కావాలా?, సుపరిపాల కావాలా?.. రాక్షస పాలన కావాలా? సంక్షేమం కావాలా?... చీకటి రాజ్యం కావాలా?’’ అంటూ అని బాలకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - Apr 26 , 2024 | 10:00 PM