Share News

AP Election 2024: కాసు మహేష్ రెడ్డి లాగా నేను అవినీతి పరుడిని కాదు: ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:19 PM

టీడీపీ క్యాడర్‌ను ఎంత అణగదొక్కిన అంతకు రెండు రెట్లు పైకి వస్తారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులకు అండగా ఉంటాం, అన్ని విదాలుగా న్యాయం చేస్తామని మాటిచ్చారు.

AP Election 2024: కాసు మహేష్ రెడ్డి లాగా నేను అవినీతి పరుడిని కాదు: ఎంపీ  శ్రీ కృష్ణ దేవరాయులు

పల్నాడు జిల్లా: టీడీపీ క్యాడర్‌ను ఎంత అణగదొక్కిన అంతకు రెండు రెట్లు పైకి వస్తారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులకు అండగా ఉంటాం, అన్ని విదాలుగా న్యాయం చేస్తామని మాటిచ్చారు.


AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..

2024 ఎన్నికల తర్వాత గురజాల మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సాగర్ కుడి కాల్వను స్థిరికరణ చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. సూపర్ 6లోని ప్రతి అంశాన్ని పక్కగా అమలు చేస్తామని తెలిపారు.


ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రం బాగు కోసం ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి టీడీపీలోకి వచ్చారని తెలిపారు. కాసు మహేష్ రెడ్డి లాగా తాను అవినీతి పరుడిని కాదని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 10:37 PM