Share News

YCP: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:27 AM

వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి పార్టీకి నేడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలోనే గుమ్మనూరు జయరాం విజయవాడకు చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు.

YCP: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..

కర్నూలు : వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. నేడు (YCP)కి మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanuru Jayaram) గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి.. పార్టీకి నేడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలోనే గుమ్మనూరు జయరాం విజయవాడ (Vijayawada)కు చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు. సాయంత్రం టీడీపీ అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరనున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు టికెట్ ఆశిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 10:27 AM