Share News

Lokesh: మరికాసేపట్లో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న లోకేష్

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:18 AM

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఉదయమే శ్రీశైలం మండలం సున్నిపెంటకు లోకేష్ చేరుకున్నారు.

Lokesh: మరికాసేపట్లో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న లోకేష్

నంద్యాల, ఫిబ్రవరి 1: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ఈరోజు (గురువారం) శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఉదయమే శ్రీశైలం మండలం సున్నిపెంటకు లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా యువనేతకు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో సాక్షిగణపతి ఆలయానికి యువనేత చేరుకున్నారు. సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించిన లోకేష్... కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికాసేపట్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను లోకేష్ దర్శించుకోనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 01 , 2024 | 10:19 AM