Share News

AP News: శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:44 PM

Andhrapradesh: శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీశైలం వస్తూ ఘాట్ రోడ్డులో ఘటన చోటు చేసుకుంది.

AP News: శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

నంద్యాల, మార్చి 20: శ్రీశైలం (Srisailam) ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీశైలం వస్తూ ఘాట్ రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. డీసీఎం వాహనంలోని వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల గ్రామం నుంచి డీసీఎం వాహనంలో శ్రీశైలం వస్తూ వాహనానికి బ్రేక్ ఫైల్ కావడంతో విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను వాహనంలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి..

AP Politics: షర్మిల పోటీపై క్లారిటీ.. రేపే కీలక ప్రకటన..?

PM Narendra Modi: రాజకీయాల్లో కొందరిని పదే పదే లాంచ్ చేయాలి.. రాహుల్‌పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 04:49 PM