Share News

AP NEWS: రెడ్డిగూడెంలో జోరుగా అక్రమ మైనింగ్.. ఆ మంత్రి అండదండలతో రెచ్చిపోతున్న నేతలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:18 PM

జిల్లాలోని రెడ్డిగూడెంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. జిల్లా మంత్రి అండదండలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.

AP NEWS: రెడ్డిగూడెంలో జోరుగా అక్రమ మైనింగ్.. ఆ మంత్రి అండదండలతో రెచ్చిపోతున్న నేతలు

ఎన్టీఆర్ జిల్లా - రెడ్డిగూడెం: జిల్లాలోని రెడ్డిగూడెంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. జిల్లా మంత్రి అండదండలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రెడ్డిగూడెం సమీపంలోని జగ్గవరపు గట్టులో మూడు రోజులుగా మైనింగ్‌ను వైసీపీ నాయకులు తరలిస్తున్నారు. ఒక్కో లారీ గ్రావెల్‌ను రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆ పార్టీ నేతలు అమ్ముతున్నారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ వెంచర్లకు గ్రావెల్ అమ్ముకొని వైసీపీ నాయకులు, జిల్లా మంత్రి అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు.

మైలవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు వత్తిళ్లతో పోలీసు యంత్రాగం రంగంలోకి దిగింది. గురువారం నాడు రెడ్డిగూడెంలో అక్రమ మైనింగ్‌పై పోలీసులు దాడి చేశారు. అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్న రెండు జేసీబీలను, రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారని.. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసుగా మారి మైనింగ్‌కు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా మైలవరం నియోజకవర్గంలో మంత్రి అనుచరులు చేసే దందాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 10:18 PM