Share News

AP News: తిరువూరులో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:36 AM

కృష్ణా జిల్లా తిరువూరులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతలు తిరువూరును యుద్ధ భూమిగా మార్చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరులో టీడీపీ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో స్వామి దాస్ తాగుబోతు, సుధారాణి బంది పోటు అంటూ కొలికపూడి వ్యక్తిగత విమర్శలు చేశారు.

AP News: తిరువూరులో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో టీడీపీ (TDP), వైసీపీ (YCP) నేతలు తిరువూరును యుద్ధ భూమిగా మార్చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరులో టీడీపీ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో స్వామి దాస్ తాగుబోతు, సుధారాణి బంది పోటు అంటూ కొలికపూడి వ్యక్తిగత విమర్శలు చేశారు.

దానికి స్వామి దాస్ ప్రతి సవాల్ విసురుతూ మీ అవినీతి బండారం బయట పెడతానని హెచ్చరించారు. అందుకు తిరువూరులో ఈరోజు ఉదయం 11 గంట లకు తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో బహిరంగ చర్చకు తాను సిద్ధమని... స్వామిదాస్ దంపతులిద్దరూ గతంలో చేసిన అవినీతిని బయటపెడతానని సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న తిరువూరులో టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు, బహిరంగ చర్చల నేపథ్యంలో హీటెక్కింది. పోలీస్‌లు ఎటువంటి ఘటనలు జరగకుండా కొలికపూడిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 09:36 AM