Share News

Devineni Uma: తనను దొంగ దెబ్బతీయడానికి కాపు కాస్తున్న వైసీపీ నేతలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:53 PM

తనను దొంగ దెబ్బతీయడానికి సందు గొందుల్లో వైసీపీ నేతలు కాపు కాశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) అన్నారు. సోమవారం నాడు జక్కంపూడి కాలనీలో జరిగిన శంఖారావం సభలో పాల్గొని దేవినేని మాట్లాడుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేతలపై ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Devineni Uma: తనను దొంగ దెబ్బతీయడానికి కాపు కాస్తున్న వైసీపీ నేతలు

ఎన్టీఆర్ జిల్లా: తనను దొంగ దెబ్బతీయడానికి సందు గొందుల్లో వైసీపీ నేతలు కాపు కాశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) అన్నారు. సోమవారం నాడు జక్కంపూడి కాలనీలో జరిగిన శంఖారావం సభలో పాల్గొని దేవినేని మాట్లాడుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేతలపై ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జక్కంపూడి కాలనీలో ఎంత దౌర్భాగ్యమంటే తల్లి కూతుళ్లు పక్క పక్కన కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2వేల మందికి కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. కేశినేని నాని, వైసీపీ నేతలు వాళ్ల తాబేదారులంతా తనను తిట్టడానికి, దాడి చేయడానికి డబ్బుల సంచులతో కాలనీలోకి వస్తారని హెచ్చరించారు.

దళితుల కాలనీలో కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు ఇవ్వలేని వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం ఓట్లు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాలనీలోకి వస్తే కరెంటు తీస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, టీడీపీ అధినేత చంద్రబాబును ఈ కాలనీకి తీసుకొచ్చానని.. కానీ జగన్ ఇక్కడకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు కట్టిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గంజాయిపై గతంలో చంద్రబాబు ఉక్కుపాదం మోపారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని తరిమి తరిమి కొట్టాలని దేవినేని ఉమ పిలుపునిచ్చారు.

Updated Date - Mar 04 , 2024 | 10:53 PM