Share News

Babu Rao: ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం

ABN , Publish Date - Jan 30 , 2024 | 09:42 PM

ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు(Babu Rao) అన్నారు. మంగళవారం నాడు విజయవాడలోని విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళన, ప్రజా బ్యాలెట్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.

Babu Rao: ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం

విజయవాడ: ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు(Babu Rao) అన్నారు. మంగళవారం నాడు విజయవాడలోని విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళన, ప్రజా బ్యాలెట్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దొడ్డి దారిన వేల కోట్ల రూపాయలు, విద్యుత్ భారాలను ప్రజలపై మోపారన్నారు. ఎన్నికలకు ముందు భారాలు లేవంటూ మోసం చేశారని.. ఇప్పుడు ప్రతి ఇంటిలో స్మార్ట్ పేరిట టైం బాంబ్ పేలుస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ, శిరిడి సాయి కంపెనీలకు కట్టబెట్టాయని ధ్వజమెత్తారు. కార్పొరేట్ల దోపిడి, పాలకుల అవినీతి ఫలితమే విద్యుత్ భారాలని అన్నారు. విద్యుత్ సంస్కరణలు విఫలం చెందాయని బాబురావు ధ్వజమెత్తారు.

Updated Date - Jan 30 , 2024 | 10:05 PM