Home » CPM
నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు.
అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి తాజాగా సీపీఎం హెచ్చరిక చేసింది. అన్నాడీఎంకే వర్గం ఎమ్మెల్యేల మద్దతు తీసుకువాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఇంతవరకూ ఇస్తున్న మద్దతుపై పునరాలోచిస్తామని తెలిపింది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.
టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేత బినోయ్ విశ్వం చెబుతుంటే, అసెంబ్లీ వేదికగా టీవీకేకు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువొత్తియూర్ నియోకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా సుందరరాజ్ పోటీచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మారేడుమిల్లిలో వరుసగా జరిగిన ఎన్కౌంటర్లపై సీపీఎం నేత శ్రీనివాసరావు స్పందించారు. బూటకపు ఎన్కౌంటర్లు అంటూ వార్తలు వస్తున్నాయన్నారు.
బిహార్లో తగినంత వర్క్ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.
సీపీఎం కార్యాలయాన్ని కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణవేదికగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం తెలిపారు. సోమవారం ఆయన తన ఎక్స్పేజీలో ఈ విషయం పోస్ట్చేశారు.