AP NEWS: 15న ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ .. ముఖ్య అతిథులుగా చంద్రబాబు, పవన్
ABN , Publish Date - Feb 14 , 2024 | 09:36 PM
నగరంలో ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ రేపు(గురువారం) జరగనున్నది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.
విజయవాడ: నగరంలో ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ రేపు(గురువారం) జరుగనున్నది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఈ పుస్తకావిష్కరణ జరుగనున్నది. ఆవిష్కర్తగా చంద్రబాబు, తొలి గ్రహీతగా పవన్ కళ్యాణ్ వ్యవహారించనున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై పుస్తకంలో సురేష్ కుమార్ పొందుపరిచారు. మొత్తం 185 అంశాలతో ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.