Share News

TDP: కొడాలి నాని మహిళలతో పాలాభిషేకం చేయించుకోవడంపై టీడీపీ నేత ఫైర్

ABN , Publish Date - Apr 03 , 2024 | 08:30 AM

మహిళా వలంటీర్‌తో మాజీ మంత్రి కొడాలి నాని కాళ్లు కడిగించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడివాడలో మహిళలతో కాళ్లపై కొడలి నాని పాలాభిషేకం చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. ముఖానికి ముసుగేసుకుని మరీ సదరు మహిళ వలంటీర్ కొడాలి నాని కాళ్లు కడిగింది.

TDP: కొడాలి నాని మహిళలతో పాలాభిషేకం చేయించుకోవడంపై టీడీపీ నేత ఫైర్

అమరావతి: మహిళా వలంటీర్‌తో మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) కాళ్లు కడిగించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడివాడలో మహిళలతో కాళ్లపై కొడాలి నాని పాలాభిషేకం చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. ముఖానికి ముసుగేసుకుని మరీ ఓ మహిళ వలంటీర్ కొడాలి నాని కాళ్లు కడిగింది. దీనిపై టీడీపీ నేత, గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. కొడాలి నాని బలుపు, అహంకారానికి ఇది మరో నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం బూతులతో విరుచుకుపడే కొడాలి నాని మహిళల్ని చులకనగా చూస్తున్నారన్నారు. అహంకారంతో బలుపు ప్రదర్శిస్తున్న కొడాలి నానికి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మహిళలే తగిన బుద్ది చెబుతారని వెనిగండ్ల రాము అన్నారు.

Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 11:32 AM