Share News

YSRCP: టీడీపీకి ఓటేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి?

ABN , Publish Date - May 16 , 2024 | 08:27 AM

ఈసారి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో పక్కనబెడితే పోలింగ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని చేయలేదట.. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్‌కి ఓటేశారట.

YSRCP: టీడీపీకి ఓటేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి?
MLA Ramireddy Prathap Kumar Reddy

నెల్లూరు: ఈసారి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో పక్కనబెడితే పోలింగ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ (TDP)కి ఓటేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని చేయలేదట.. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్‌కి ఓటేశారట. ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Konakalla Narayana Rao: టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు అస్వస్థత..


రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.. వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయబోయి హడావుడిలో ఎన్డీఏ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసినట్టు సమాచారం. ఆ వెంటనే పొరబాటును గ్రహించిన ప్రతాప్ కుమార్ రెడ్డి.. తాను సైకిల్‌కి ఓటేశానని.. మళ్లీ మార్చమని పోలింగ్ సిబ్బందిని అడిగారని తెలుస్తోంది. ఒకసారి ఓటేశాక తిరిగి మార్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆయన ఓటు టీడీపీ ఖాతాలో పడిపోయింది. ఈ విషయం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వరకూ వెళ్లిందో లేదో.. వెళితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటనే దానిపై వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి..

AP Voters : దుమ్మురేపిన ఓటర్‌!

Road Accident : నిద్రలోనే అగ్నికి ఆహుతి

Read more AP News and Telugu News

Updated Date - May 16 , 2024 | 08:27 AM