Kambhampati: విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్
ABN , Publish Date - Mar 29 , 2024 | 08:30 PM
విద్యా వ్యవస్థను సీఎం జగన్ రెడ్డి(CM Jagan) నిర్వీర్యం చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu desham Party) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు(Kambhampati Rammohan Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు విద్యాశాఖ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
అమరావతి: విద్యా వ్యవస్థను సీఎం జగన్ రెడ్డి (CM Jagan) నిర్వీర్యం చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu desham Party) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు (Kambhampati Rammohan Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు విద్యాశాఖ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. విద్యా మండలి వ్యవస్థను వైసీపీ కార్యాలయంలా హేమచంద్రారెడ్డి మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రవీణ్ ప్రకాష్ వేధిస్తున్నారని చెప్పారు.
TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?
మూతపడే బైజూస్ లాంటి సంస్థకు రూ.500 కోట్లు ధారాదత్తం చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 292 పాఠశాలలను జూనియర్ కాలేజీల్లా మార్చారని మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడి కారు కిరాయి ఖర్చు కూడా విద్యా మండలి భరిస్తోందన్నారు. ఆంధ్ర వీసీ ప్రసాద్ రెడ్డి, నాగార్జున వీసీ రాజశేఖర్లతో విశ్వవిద్యాలయాలను కలుషితం చేస్తున్నారని ఏకిపారేశారు. దాదాపు రూ.1000 కోట్ల విద్యా శాఖ నిధులను దారి మళ్లించారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రూ.400 కోట్లు, ఇంటర్ బోర్డ్ నుంచి రూ.230 కోట్లు, 20 ఏళ్లుగా విద్యార్థులు కడుతున్నారని.. రూ.110 కోట్లు ఫీజులను దోచుకున్నారని కంభంపాటి రామ్మోహన్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Atchannaidu: జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి