Share News

Harirama Jogaiah: టీడీపీ - జనసేన కూటమితోనే బీసీలకు న్యాయం

ABN , Publish Date - Mar 19 , 2024 | 05:49 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) మంగళవారం నాడు లేఖ రాశారు. బీసీలకు డిక్లరేషన్ ద్వారా 11 హామీలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందించదగిన విషయమేనని తెలిపారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే రాబోవు జనసేన, తెలుగుదేశం కూటమిలోనే బీసీలకు ఎక్కువ లబ్ధి జరిగే అవకాశం ఉందని వివరించారు.

Harirama Jogaiah: టీడీపీ - జనసేన కూటమితోనే  బీసీలకు న్యాయం

పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) మంగళవారం నాడు లేఖ రాశారు. బీసీలకు డిక్లరేషన్ ద్వారా 11 హామీలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందించదగిన విషయమేనని తెలిపారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే రాబోవు జనసేన, తెలుగుదేశం కూటమిలోనే బీసీలకు ఎక్కువ లబ్ధి జరిగే అవకాశం ఉందని వివరించారు. ఒకనాడు బీసీలుగా గుర్తించబడిన కాపులను మళ్లీ బీసీలుగా గుర్తించే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. కావున వచ్చే జనసేన, తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో కాపులకు కూడా బీసీలతో సమానమైన సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని హరిరామ జోగయ్య అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 05:49 PM