Share News

AP NEWS: మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత.. కారణమిదే..?

ABN , Publish Date - Feb 25 , 2024 | 09:02 PM

జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిమ్స్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని వివరాలు తెలిపేలా ఓ ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే ఎయిమ్స్ నిర్మాణం చేశారని ఫ్లెక్సీలో వివరించారు. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

AP NEWS: మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత.. కారణమిదే..?

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిమ్స్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని వివరాలు తెలిపేలా ఓ ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే ఎయిమ్స్ నిర్మాణం చేశారని ఫ్లెక్సీలో వివరించారు. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫ్లెక్లీ తొలగించేందుకు పోలీసులు ఆస్పత్రి దగ్గరకు వచ్చారు. పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి లేని బాధ పోలీసులకు ఎందుకని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. బీజేపీ నేతలకు - పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ తోపులాట జరగడంతో బీజేపీ శ్రేణులు గాయపడ్డారు.

Updated Date - Feb 25 , 2024 | 09:02 PM