Share News

Brahma Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:29 PM

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు.

Brahma Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

పల్నాడు జిల్లా: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు. పిన్నెల్లి వల్లే మాచర్ల పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొందన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రి దగ్గరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తన సామాజిక వర్గంపై దాడి జరుగుతుంటే ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ కరువైందని మండిపడ్డారు. ఇలాంటి అరాచక శక్తులకు మరోసారి అధికారం ఇస్తే అందరి మీద దాడులు జరుగుతాయని హెచ్చరించారు. పిన్నెల్లిను మాచర్లకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల అండదండలతో శాంతి భద్రతలను తన చేతిలో ఉంచుకొని ఎమ్మెల్యే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలు చేయటం కాదని.. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని తేల్చుకుందామని జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - Feb 16 , 2024 | 03:36 PM