Share News

Ambati Rayudu: పవన్ కళ్యాణ్‌తో ముగిసిన అంబటి రాయుడు భేటీ.. ఏం చర్చించారంటే..?

ABN , Publish Date - Jan 10 , 2024 | 05:04 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) తో మాజీక్రికెటర్ అంబటి రాయుడు ( Ambati Rayudu ) బుధవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Ambati Rayudu: పవన్ కళ్యాణ్‌తో ముగిసిన అంబటి రాయుడు భేటీ.. ఏం చర్చించారంటే..?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) తో మాజీక్రికెటర్ అంబటి రాయుడు ( Ambati Rayudu ) బుధవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.తన సొంత జాగ్వర్ కార్‌లో జనసేన కార్యాలయానికి అంబటి రాయుడు వచ్చారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి అంబటి రాయుడు మధ్యాహ్న భోజనం చేశారు.భోజనం అనంతరం గంట పాటు చర్చించారు. అయితే మీడియాతో మాట్లాడకుండానే అంబటి రాయుడు వెళ్లిపోయారు.

కాగా.. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారట. అయితే.. టికెట్‌పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం పది రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలో అంబటి రాయుడు చేరే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతానని అంబటి రాయుడు రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Jan 10 , 2024 | 05:04 PM