Share News

Perninani: పవన్ నువ్వు నికార్సైన వాడివైతే...

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:21 PM

Andhrapradesh: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కాపుల ఓట్లు కావాలని.. కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక్క మాట అయినా మాట్లాడారా? అంటూ మాజీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ గురించి తెలుసని చెప్పడం ఎందుకు.. జగన్ గురించి సమాచారం ఉంటే బయట పెట్టాలి. పవన్ నువ్వు నికార్స్ అయిన వాడివి అయితే బయట పెట్టు’’ అని సవాల్ విసిరారు.

Perninani: పవన్ నువ్వు నికార్సైన వాడివైతే...

అమరావతి, ఫిబ్రవరి 29: టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) కాపుల ఓట్లు కావాలని.. కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక్క మాట అయినా మాట్లాడారా? అంటూ మాజీ మంత్రి పేర్నినాని (Former Perni Nani) విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ గురించి తెలుసని చెప్పడం ఎందుకు.. జగన్ గురించి సమాచారం ఉంటే బయట పెట్టాలి. పవన్ నువ్వు నికార్సైన వాడివి అయితే బయట పెట్టు. జగన్ దగ్గర బేరాలు ఉండవు. బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నావా? నీ దగ్గర సమాచారం ఏమి చేసుకుంటావో చేసుకో. 2019లో జగన్, పవన్ కళ్యాణ్‌ను మడిచి తొంగోబెట్టారు. 2019లో అమరావతి ఒక కులానికి రాజధాని అని చెప్పారు. ఆ రోజుకి ఈ రోజుకి చంద్రబాబు, నీకు మధ్య ఏమి జరిగింది. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటే మాకు ఎంటి? 24 కాకపోతే నాలుగు తీసుకో. జనసేన నేతలు, కార్యకర్తలకు బాధ ఉండాలి. హరిరామ జోగయ్య, ముద్రగడ లాంటి వారికి, కాపులకు బాధ ఉండొచ్చు’’ అంటూ పేర్నినాని వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 03:25 PM