Share News

AP Politics: ఏ పార్టీ ప్రచార వాహనాలు తిరగటానికి వీల్లేదు.. పెదపూడిలో వైసీపీ అరాచకం

ABN , Publish Date - Jan 24 , 2024 | 04:02 PM

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకానికి అంతేలేకుండా పోతుందనడానికి కాకినాడలో జరిగిన ఘటనే నిదర్శనం. అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరుకుంది.

AP Politics: ఏ పార్టీ ప్రచార వాహనాలు తిరగటానికి వీల్లేదు.. పెదపూడిలో వైసీపీ అరాచకం

కాకినాడ, జనవరి 24: రాష్ట్రంలో వైసీపీ నేతల (YCP) అరాచకానికి అంతేలేకుండా పోతుందనడానికి కాకినాడలో జరిగిన ఘటనే నిదర్శనం. అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరుకుంది. జనసేన (Janasena) ప్రచార వాహనాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. అంతే కాకుండా గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన ప్రచార వాహనాలను తిరగనిచ్చేది లేదని అధికారపార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నేతల వైఖరి పట్ల టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు.

వైసీపీ అరాచకంపై పోలీసులకు టీడీపీ నేతలు సమాచారం ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో పోలీసుల తీరుపై అనపర్తి టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (TDP Leader Nallamilli Ramakrishna reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాన్ని సీఐ, ఎస్‌ఐకు ఫోన్‌లో వివరించినప్పటికీ స్పందన లేకపోవడంతో మండిపడ్డారు. మరోపక్క జనసేన ప్రచార వాహనం కాగితాలు, తాళాలు లాక్కోవడంపై టీడీపీ, జనసేన శ్రేణులు నిరసనకు దిగారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2024 | 04:10 PM