Share News

Pawan Kalyan: ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్న పవన్

ABN , Publish Date - Feb 20 , 2024 | 08:24 AM

నేడు రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు జరగనున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనాయకులతో పవన్ సమావేశం కానున్నారు.

Pawan Kalyan: ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్న పవన్

కాకినాడ: నేడు రాజమండ్రి (Rajahmundry)లో జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు జరగనున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనాయకులతో పవన్ సమావేశం కానున్నారు. టీడీపీ (TDP)తో సీట్ల సర్దుబాటు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్లు గత నెలలోనే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Feb 20 , 2024 | 08:24 AM