Share News

AP Elections: పిఠాపురంలో పవన్ రెండో రోజు ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:35 PM

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రెండోరోజు ఆదివారం పిఠాపురంలో కొనసాగుతోంది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికగా దేవి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దత్తపీఠం దర్శనాన్ని రద్దు చేసుకున్నారు.

AP Elections: పిఠాపురంలో పవన్ రెండో రోజు ఎన్నికల ప్రచారం

కాకినాడ: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారం (Election Campaign) రెండోరోజు (second day) ఆదివారం పిఠాపురం (Pithapuram)లో కొనసాగుతోంది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికగా దేవి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దత్తపీఠం దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను పవన్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే బూత్ లెవెల్లో కూటమి నేతలు కలిసి ఏ విధంగా పని చేయాలి.. వైసీపీ (YCP) చేస్తున్న కుట్రలు, కుయుక్తులు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్న దానిపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Updated Date - Mar 31 , 2024 | 12:46 PM