Share News

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

ABN , Publish Date - Mar 18 , 2024 | 02:05 PM

బొప్పూడి సభలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని.. వైసీపీని ఓడించాలనే కసితో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర తెలిపారు. ప్రధానమంత్రి వచ్చే సభకు భద్రతా ఏర్పాట్లు చూడాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

అమరావతి: బొప్పూడి సభలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని.. వైసీపీ (YSRCP)ని ఓడించాలనే కసితో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారని టీడీపీ (TDP) సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర (Dhulipalla Narendra) తెలిపారు. ప్రధానమంత్రి వచ్చే సభకు భద్రతా ఏర్పాట్లు చూడాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అనువైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసుల వైఫల్యంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని నరేంద్ర తెలిపారు. స్వయంగా ప్రధానమంత్రి మోదీ (PM Modi) పోలీసుల తీరును తప్పుపడుతూ ప్రజలకు విజ్ఞప్తులు చేయాల్సి వచ్చిందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన సీనియర్ పోలీసు అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలపై సీఈసీ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ధూళిపాళ నరేంద్ర తెలిపారు.

YSRCP: నందిగామలో వైసీపీకి భారీ షాక్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 02:06 PM