Revanth Live: విశాఖ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్.. జగన్ గురించి మాట్లాడుతారా..?
ABN , Publish Date - Mar 16 , 2024 | 05:56 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని తృష్ణ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటుండడం గమనార్హం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు బహిరంగ సభ జరుగుతోంది. విశాఖపట్నంలోని తృష్ణ మైదానంలో జరుగుతున్న ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారిగా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి.. వైసీపీపై ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సభలో రేవంత్ రెడ్డితోపాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. నేతలంతా ఇప్పటికే వేదికపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ వీడియోను చూడాలంటే కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి.