Share News

Minister Roja: శ్రీవారి ఆలయానికి వచ్చిన రోజాకు ఊహించని షాక్..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 09:43 AM

Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా నెలలో ఒకసారి శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా నిత్యం శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు..

Minister Roja: శ్రీవారి ఆలయానికి వచ్చిన రోజాకు ఊహించని షాక్..!

తిరుమల, ఫిబ్రవరి 2: ఏపీ మంత్రి రోజా (Minister Roja) నెలలో ఒకసారి శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. ఇది కాస్త.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా నిత్యం శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎప్పటిలాగే ఈరోజు (శుక్రవారం) కూడా స్వామివారిని దర్శించుకోడానికి రోజా.. తిరుమలకు రాగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద ‘‘జై అమరావతి’’ అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. అంతేకాదు.. ‘జై అమరావతి’ అని నినదించాలంటూ వారు రోజాను కోరారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా.. ‘‘శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది’’ అంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2024 | 11:56 AM