Share News

YSRCP: చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభం

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:37 AM

చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభమైంది. రోజురోజుకూ కుమ్ములాటల పర్వం పెరుగుతోంది. వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి వర్గీల మధ్య గొడవలు తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డిని, ఆయన అనుచరులని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

YSRCP: చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభం

చిత్తూరు: చిత్తూరు వైసీపీ (YSRCP)లో ముసలం ప్రారంభమైంది. రోజురోజుకూ కుమ్ములాటల పర్వం పెరుగుతోంది. వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి (Vijayananda Reddy), డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి (Rajesh Kumar Reddy) వర్గీయుల మధ్య గొడవలు తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డిని, ఆయన అనుచరులని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు విజయానంద రెడ్డి సహా ఇరు వర్గాల అనుచరులు భారీగా చేరుకున్నారు. నిన్న మొన్నటి వరకు విజయానంద రెడ్డికి రైట్ హ్యాండ్‌గా రాజేష్ కుమార్ రెడ్డి మెలిగారు. తాజాగా రాత్రి చోటు చేసుకున్న ఇరు వర్గాల అనుచరుల దాడి ఆ పార్టీలో ఎన్నికలవేళ తీవ్ర కలకలం రేపుతోంది.

AP Politics: టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట అల్పాహార విందు...

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 12:02 PM