Share News

NTR Statue.. చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

ABN , Publish Date - Jun 09 , 2024 | 07:08 AM

చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

NTR Statue.. చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR Statu) ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ (Old Police Sation) ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికలు ముగిశాక ఆ వెంటనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


అయితే ఆ విగ్రహానికి అనేక కారణాలు చూపుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం, అధికారులు ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయకుండా తొలగించారు. దాంతో అప్పటి నుంచి విగ్రహం లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణులు అదే స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జనం నేర్పిన గుణపాఠం

అమరావతికి మళ్లీ కళ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 09 , 2024 | 07:12 AM