Share News

TTD EO Dharma Reddy: ఎట్టకేలకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు..

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:54 PM

టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy)కి ఎట్టకేలకు సెలవు మంజూరు అయ్యింది. ఈనెల 11నుంచి 17వరకు సెలవు ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ (CS Nirabh Kumar) ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో తిరుమల వదిలి వెళ్లవచ్చని కానీ రాష్ట్రం వదిలి వెళ్లవద్దంటూ సీఎస్ ఆదేశించారు.

TTD EO Dharma Reddy: ఎట్టకేలకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు..

తిరుమల: టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy)కి ఎట్టకేలకు సెలవు మంజూరు అయ్యింది. ఈనెల 11నుంచి 17వరకు సెలవు ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్(CS Nirabh Kumar) ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో తిరుమల వదిలి వెళ్లవచ్చని కానీ రాష్ట్రం వదిలి వెళ్లవద్దంటూ సీఎస్ ఆదేశించారు. గత వారం సెలవు కోసం ధర్మారెడ్డి ప్రయత్నించారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో గత సీఎస్ జవహర్ రెడ్డి మంజూరు చేయలేదు. ఈనెల 12 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు రాత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఈలోపే ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేశారు. అయితే ఈయన అధికార పార్టీతో అంటకాగారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

For more Andhra Pradesh News and Telugu News Click here..

Updated Date - Jun 10 , 2024 | 09:54 PM