Share News

Janasena: జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:12 PM

జనసేన (Janasena) పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న ‘విశ్వంభర’ ఘూటింగ్ లోకేషన్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, నాగబాబు చిరంజీవిని కలిశారు. అన్నదమ్ములు గంటపాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

Janasena: జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం

అమరావతి: జనసేన (Janasena) పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న ‘విశ్వంభర’ ఘూటింగ్ లోకేషన్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, నాగబాబు చిరంజీవిని కలిశారు. అన్నదమ్ములు గంటపాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు


జనసేనకు విజయోస్తు.... విజయీభవ అని పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను దీవించారు. పవన్ కళ్యాణ్‌కు రూ. ఐదు కోట్ల చెక్‌ను ఆంజనేయ విగ్రహం సమక్షంలో చిరంజీవి అందజేశారు. ‘విశ్వంభర’ షూటింగ్‌లో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. చిరంజీవి పాదాలకు నమస్కారం చేసి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందుకున్నారు. అక్కడే రూ. 5కోట్ల చెక్‌ను పవన్ కళ్యాణ్, నాగబాబులకు అందజేశారు.


ఇవి కూడా చదవండి

AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 06:24 PM