Share News

Chandrababu Naidu: చంద్రబాబు నివాసంలో విందు.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:00 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.

Chandrababu Naidu: చంద్రబాబు నివాసంలో విందు.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు

అమరావతి, జూన్ 11: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు. ఈ విందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆ శాఖ సహయ మంత్రి బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతోపాటు బీజేపీలోకి పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.

Also Read: Loksabha Election Result: మంత్రి పదవికి జితిన్ ప్రసాద రాజీనామా.. ఎందుకంటే..


Also Read: Odisha: సీఎం ప్రమాణ స్వీకారం.. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

సోమవారం రాత్రి 9.35 గంటలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్, జేపీ నడ్డా తదితరులు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం వారు నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. రాత్రికి చంద్రబాబు ఇచ్చే విందులో వారు పాల్గొంటారు. రేపు ఉదయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారంతా పాల్గొంటారు. ఆ తర్వాత.. గన్నవరం ఎయిర్ పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 05:04 PM